AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే వంశీని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కలవనున్నారు. ఉదయం తాడేపల్లి ఇంటి నుంచి బయల్దేరి 10.30 గంటలకు జైలులో వంశీతో ములాఖత్ అవుతారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు కూడా సబ్ జైలు వరకూ ఆయన వెంట వెళ్లనున్నారు. ఆ తర్వాత వంశీ అరెస్ట్పై జైలు బయట స్పందించనున్నారు.