మత్స్యశాఖ నుంచి 109 బోట్లు

81చూసినవారు
మత్స్యశాఖ నుంచి 109 బోట్లు
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ మేరకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. సహాయక చర్యల్లో భాగంగా మత్స్యశాఖ నుంచి 109 బోట్లు అందుబాటులో ఉంచారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ఇప్పటికే 56 బోట్లను ముంపు ప్రాంతాలకు పంపించారు. మరో 53 బోట్లను తక్షణమే పంపాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, కాకినాడ, ప్రకాశం జిల్లాల నుంచి బోట్లను అధికారులు తరలించారు.
Job Suitcase

Jobs near you