దారుణం..ప్రాణం తీసిన కుక్క
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుక్కకాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. నందిపేట లక్కంపల్లి సెజ్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహేశ్(36)ను ఈ నెల 10న విధుల్లో ఉన్న సమయంలో కుక్క కరిచింది. నందిపేట PHCలో టీకాలు ఇప్పించుకున్నాడు. అనంతరం తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స నిమిత్తం ఇవాళ మృతి చెందాడు.