కృష్ణా-విజయవాడ - Krishna-Vijayawada

లోకేష్ సమక్షంలో టిడిపిలోకి నగరాల ప్రముఖులు!

లోకేష్ సమక్షంలో టిడిపిలోకి నగరాల ప్రముఖులు!

అమరావతి: విజయవాడకు చెందిన నగరాల సామాజికవర్గ ప్రముఖులు యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో ఎంపి అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యాన సుమారు 400 కుటుంబాలు తరలివచ్చి పార్టీలో చేరారు. వారందరికీ యువనేత లోకేష్ పసుపుకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తాడి శకుంతల కూడా టిడిపిలో చేరారు. ఆమెకు పసుపు కండువా కప్పి లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ బలహీనవర్గాలకు పుట్టినిల్లు లాంటిది, టిడిపి ద్వారానే బలహీనవర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో ఏనాడు బిసిలపై దాడులు, వేధింపులు లేవు. జగన్ అధికారంలోకి వచ్చాక 26వేలమంది బిసిలపై తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే బిసి రక్షణ చట్టంతో బలహీనవర్గాలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే బిసి డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో గుజ్జరి అమర్ బాబు (మాజీ ఎమ్మెల్యే మరుపిళ్ల చిట్టి గారి మనవడు), లింగిపిల్లి అప్పారావు (అధ్యక్షుడు, శ్రీ నగరాలు దేవస్థానం), పిల్లా శ్రీనివాసరావు (కోశాధికారి, శ్రీ నగరాలు దేవస్థానం), రాంపిళ్ల శ్రీనివాసరావు (గౌరవాధ్యక్షులు, నగరాలు ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్), ఈడి ఎల్లరాజారావు (మాజీ సెక్రటరీ, శ్రీనగరాలు దేవస్థానం), లింగిపిల్లి రామకృష్ణ (అధ్యక్షుడు, శ్రీనగరాలు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ), బెవర సూర్యనారాయణ (గౌరవాధ్యక్షుడు , శ్రీనగరాలు దేవస్థానం) అడ్డూరి రాము (అధ్యక్షుడు, కృష్ణాజిల్లా నగరాల సంఘం), కమందుల నరసింహారావు (కార్యదర్శి, కృష్ణాజిల్లా నగరాలు సంఘం), గుడెల శ్రీనివాసరావు (మాజీ అధ్యక్షుడు, కృష్ణాజిల్లా నగరాలు సంఘం), పిల్లా విజయ్ కుమార్ (కోశాధికారి, నగరాలు ఐక్యవేదిక, ఆంధ్రప్రదేశ్), తమ్మిన సూర్య జయనారాయణ రావు (మాజీ కోశాధికారి, ఆంధ్రప్రదేశ్ నగరాలు సంఘం), బయన అచ్యుతరావు, మజ్జి సాంబశివరావు, నాగోతి వాసు, నాగోతి రవి కుమార్, గర్రె మురళీ మోహన్, చింతాడ బాలకృష్ణ, మరుపిళ్ల సత్తిబాబు, కోరికని దివాకర్, మాకిన సత్యనారాయణ, చీపిళ్ల వెంకటేశ్వరరావు, దేవిన సతీష్, మరుపిళ్ల వాసు తదితరులు ఉన్నారు.

వీడియోలు


ఆంధ్రప్రదేశ్