రాములోరి కళ్యాణం.. విద్యార్థులు అన్నదానం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం సిరిపురం గ్రామంలో శ్రీరామనవమి వేడుగాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1997-98 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు తమ పూర్వ జ్ఞాపకాలను తలుచుకున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలోగ్రామానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకుగాను విద్యార్థులను గ్రామస్తులు అభినందించారు.