
పాయకరావుపేట
పాయకరావుపేట: మెగా జాబ్ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
పాయకరావుపేటలో ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఈనెల 28న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో 50 కంపెనీలు మెగా జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాస్, సీఐ జి. అప్పన్న బాబు, మండల సూపర్వైజర్ వర్మ ఉన్నారు.