AP: ఇంటర్ ఫలితాలపై బోర్డు కీలక ప్రకటన
ఇంటర్ ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. జనరల్తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలను కూడా విడుదల చేస్తామని తెలిపింది. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వేదికగా బోర్డు కార్యదర్శి ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొంది.