గజపతినగరం
జ్యోతిరావు పూలే ఆశయాలను ఆచరించాలి
జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు కోరారు. గురువారం జ్యోతిరావు పూలే జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు, దేవర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.