14 రోజుల కష్టం.. ఎట్టకేలకు చిక్కిన చిరుత (వీడియో)

69చూసినవారు
నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచర్లలో అటవీశాఖ అధికారులు చిరుతను బంధించారు. జనావాసాల్లోకి వచ్చిన చిరుత పలు చోట్ల జంతువులు, మనుషులపై దాడి చేస్తోంది. 14 రోజులుగా అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలిస్తుండగా.. తాజాగా బోనులో పట్టుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం పచ్చర్లలో మెహురూన్బీ అనే మహిళను ఈ చిరుత దాడి చేసి చంపేసింది.

సంబంధిత పోస్ట్