రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ముగిసింది. 17 రోజుల పాటు రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించారు. టెట్కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా.. 3,68,661 (86.28%) మంది హాజరయ్యారు. పేపర్-2ఏ సాంఘిక శాస్త్రం, పేపర్-2బీ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ‘కీ’ రేపటి నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని కన్వీనర్ ఎంవీ.కృష్ణారెడ్డి తెలిపారు.