నగరి నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీపురంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వాటర్ ప్లాంట్ యజమాని జగదీష్ను ఈ నెల 3న ఎనిమిది మంది కత్తులతో దారుణంగా నరికి చంపారు. పరారీలో ఉన్న నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు డీఎస్పీ నరసింహామూర్తి తెలిపారు.