బుడమేరు కట్ట పటిష్ఠతకు అధికార యంత్రాంగం చర్యలు

65చూసినవారు
బంగాళాఖాతంలో మరోసారి ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే ఏపీ ప్రభుత్వం ఎంతో కష్టపడి బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చివేసింది. అయితే మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉండడంతో బుడమేరు కట్టను పటిష్ఠం చేసేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కృషి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్