పాడేరు ఐటీడీఎ ఎదుట విద్యార్థుల నిరసన దీక్ష

80చూసినవారు
గిరిజన హాస్టల్ విద్యార్థుల సమస్యలపై పాడేరు ఐటీడీఎ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లకు అదనపు భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రతీ వసతిగృహంలో వాచ్మెన్, హెల్త్ వర్కర్లను నియమించి, విద్యార్థుల మరణాలను అరికట్టాలని నినాదాలు చేశారు. గిరిజన విద్యార్థుల ఫీజులు ప్రభుత్వమే భరించాలని, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్