మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి

61చూసినవారు
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి
ఈ విద్యాసంవత్సరంలో జరగనున్న టెన్త్ పరీక్షలకు విద్యార్థులను ముందుగానే సంసిద్ధత చేయాలని, చదువులో వెనుకబడి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారిణి బి. శకుంతల సూచించారు. శనివారం మండలంలోని గొడిచెర్ల హైస్కూలు ఆమె తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, ల్యాబ్, గ్రంథాలయాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం తయారు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్