రెండో విడత చందనం అరగదీత ప్రారంభం
విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామివారికి రెండవ విడత చందనం సమర్పణకు గాను ఈఓ శ్రీనివాస మూర్తి ఆదేశాలతో ఆలయ స్థానాచార్యులు పి రాజగోపాల్ ఆధ్వర్యంలో శ్రీనివాసచార్యుడు పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది చందనం అరగదీసే కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. చందనాన్ని భాండాగారంలో భద్రపరిచారు. ఈ మేరకు దగ్గరుండి ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.