ట్రాన్స్ ఫార్మర్ ను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

538చూసినవారు
కళ్యాణదుర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన రాంభూపాల్ రెడ్డి స్వగ్రామమైన వెంకటంపల్లి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను గత రాత్రి దుండగులు ధ్వంసం చేశారని కళ్యాణదుర్గం డిఎస్పీ శ్రీనివాసులుకు శనివారం ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కంబదూరు మండల వైకాపా కన్వీనర్ కొత్తపల్లి ఈరన్న డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్