కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కళాకారుల జిల్లా ఐక్యవేదిక అధ్యక్షుడు బెస్త శ్రీనివాసులు అన్నారు. గురువారం ధర్మవరంలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే కళాకారులకు 6000 రూపాయలు పెన్షన్ ఇచ్చి పక్కా గృహాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కళాకారులను విస్మరించిందని ప్రభుత్వ నిర్లక్ష్యంతో కళాకారులు వీధిన పడ్డారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.