శాశ్విత రోడ్లు నిర్మించండి-సిపిఎం

483చూసినవారు
శాశ్విత రోడ్లు నిర్మించండి-సిపిఎం
కదిరి పట్టణంలో హిందూపూర్ క్రాస్ నుండి కోనేరు వరకు రోడ్డును మరమ్మతులు చేసి శాశ్వత రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ హిందూపూర్ సర్కిల్ నుండి కోనేరు వరకు ఉన్న రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గుంతలు పడ్డాయన్నారు. చిన్నపాటి వర్షం వస్తే చాలు రోడ్డు మొత్తం చెరువులను తలపిస్తోందన్నారు.
ఈకార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :