కదిరిలోని నిజాం వలి కాలనీలో గల 15వ వార్డులో ఆదివారం కదిరి ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ షానవాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ కు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను షానవాజ్ కోరారు. ఆయన మాట్లాడుతూ. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.