సమస్యాత్మక గ్రామాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలి
బ్రహ్మసముద్రం మండలంలోని సమస్యాత్మక గ్రామమైన నాగిరెడ్డిపల్లిలో కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు గురువారం రాత్రి పల్లెనిద్ర చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డీఎస్పీ బి. శ్రీనివాసులు గ్రామంలో ప్రజలతో సమావేశమయ్యారు. డీఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రశాంతంగా మెలగాలని గ్రామస్తులను కోరారు. అల్లర్లు, గొడవలు జోలికెళ్లవద్దని సూచించారు. కేసుల్లో ఇరుక్కుపోయి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు.