నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలి: సీపీఐ
రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలని ముదిగుబ్బ సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం ముదిగుబ్బలోని వ్యవసాయ గోదాములో ఉన్న కాయలను పరిశీలించారు. విత్తనాలు 40% నాశిరకంగా ఉన్నాయన్నారు. కాయల్లో అక్కడక్కడా రాళ్లు బొటికలు ఉన్నాయన్నారు. ఇలా ఉంటే రైతులు ఎలా విత్తుతారన్నారు. నాణ్యమైన విత్తన కాయలు ఇవ్వకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.