సీఎం సహాయ నిధికి రూ. ఐదు లక్షలు అందించిన పరిటాల శ్రీరామ్

72చూసినవారు
సీఎం సహాయ నిధికి రూ. ఐదు లక్షలు అందించిన పరిటాల శ్రీరామ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జిలతో ఉండవల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా విజయవాడ వరద బాధితుల సహాయార్ధం పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ తరుపున 5 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్