అన్నా, వదిన తన ఇంటిని ఆక్రమించుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. యాడికి మండలంలోని చింతలాయపల్లె గ్రామానికి చెందిన భారతి 2014లో ప్రభుత్వ గృహాన్ని నిర్మించుకుంది. ఇటీవల అన్న నాగార్జున, వదిన రాజేశ్వరి దౌర్జన్యంగా ఇల్లు ఆక్రమించుకున్నారని ఆమె ఫిర్యాదు చేసింది.