నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

50చూసినవారు
ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాడిపత్రి డీఎస్పీ జనార్ధన్ నాయుడు హెచ్చరించారు. శనివారం ఆయన తాడిపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినవారిపై కేసులు నమోదు చేస్తామని, తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తే వారి పూచికత్తు ఇచ్చిన నగదు మొత్తాన్ని వసూలు చేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్