హంస వాహనంపై విహరించిన శ్రీవారు

565చూసినవారు
హంస వాహనంపై విహరించిన శ్రీవారు
పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి హంస వాహనోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు హంస వాహనంపై మాడవీధుల్లో దర్శనమిచ్చారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేకువజామున మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి మూలవిరాట్‌‌కు, ఉత్సవమూర్తులకు అర్చనలు, మంగళ హారతులను అర్చకులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్