మ‌చిలీప‌ట్నంలో అనిశా అధికారుల తనిఖీలు

74చూసినవారు
మ‌చిలీప‌ట్నంలో అనిశా అధికారుల తనిఖీలు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల్లో ప్ర‌భుత్వాధికారి చెన్నూరి శ్రీనివాస్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డారు. పౌరసరఫరాల శాఖలో డీటీగా పనిచేస్తున్న శ్రీనివాస్.. ప్రతినెలా మామూళ్లు ఇవ్వాలని ఓ రైస్‌మిల్‌ యజమానిని కోరాడు. దీనిపై అనిశా అధికారుల‌కు రైస్‌మిల్‌ యజమాని ఫిర్యాదు చేయ‌గా.. వారు తనిఖీలు నిర్వ‌హించి శ్రీ‌నివాస్‌ను ప‌ట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్