
అద్దంకి: కరెంట్ కోతలు లేకుండా చూడాలి: హేబేలు
అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త సోమవారం బాపట్లలో నిర్వహించిన గ్రీవెన్స్ లో విద్యుత్ కోతలపై కలెక్టర్ వెంకట మురళికి వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాత్రి వేళల్లో గంటల తరబడి కరెంటు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హేబేలు పేర్కొన్నారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు.