ఆర్యవైశ్యులకి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని. చీరాల టిడిపి అభ్యర్థి కొండయ్య యాదవ్ భరోసా ఇచ్చారు. పట్టణంలోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ లో ఆయన గురువారం ప్రతి దుకాణం తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు. క్లాత్ మార్కెట్ ప్రెసిడెంట్ వేముల శేఖర్, సెక్రటరీ తాతా కుమారస్వామి స్వాగతం పలికారు. తమ మద్దతు ఉంటుందని వారు ఆయనకు హామీ ఇచ్చారు. పలువురు వస్త్ర వ్యాపారులు ఆయనకు చిరు సన్మానాలు చేశారు.