నగరంపాలెం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ దాతృత్వం

80చూసినవారు
విజయవాడ వరద బాధితులు కోసం నగరం పాలెంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆదివారం భోజనం ప్యాకెట్లను సరఫరా చేసింది. ఈ మేరకు చర్చీ వద్ద నుంచి భోజనం తీసుకెళ్తున్న వాహనాన్ని జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే మానవజన్మకు అర్థమని అభివర్ణించారు. తెలుగు బాప్టిస్ట్ చర్చీ అందిస్తున్న అందరికీ ఆదర్శమని అన్నారు.

సంబంధిత పోస్ట్