ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరసన

69చూసినవారు
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రైతు సంఘం ఆధ్వర్యంలో సత్తెనపల్లి తహసిల్దార్ కార్యాలయము ముందు శనివారం నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘం రాష్ట్ర నాయకులు చలమయ్య మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం కింద హామీ ఇచ్చిన రూ.20వేలను వెంటనే ఇవ్వాలన్నారు. అందుకు విధి విధానాలను ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గుంటుపల్లి బాలకృష్ణ, పెండ్యాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్