కర్నూలు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలనుంది. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నలుగురు టీడీపీ నేతలు పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డోన్, పత్తికొండ టికెట్ ఆశించిన కేఈ ప్రభాకర్, మంత్రాలయం టికెట్ ఆశించిన తిక్కారెడ్డి, ఆలూరు టికెట్ ఆశించిన వైకుంఠ మల్లికార్జున చౌదరి, పత్తికొండ టికెట్ ఆశించిన మసాలా పద్మజ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం.