నిస్వార్థ సేవ చేస్తున్న వాలంటీర్లను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని APFDC ఛైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఎల్లో మీడియా, చంద్రబాబుకు మహిళలంటే గౌరవం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను నమ్మొద్దు. చంద్రబాబు నంబర్ వన్ కిలాడీ. తన రాజకీయ భవిష్యత్ కోసం చంద్రబాబు వంగావీటి రంగాను హత్య చేయించారు. సీఎంగా చంద్రబాబు పనికిరారు." అని పోసాని చెప్పారు.