ప్రభుత్వాసుపత్రులలో కాన్పులు చేసుకోవడం సురక్షితమని వైద్యులు విజయ్ చందర్ సోమవారం అన్నారు. వికోట పట్టణంలోని ప్రభుత్వాసుప్రతిలో పీఎం సురక్షిత మాతృ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులకు, బాలింతలకు ఆరోగ్య సూత్రాలను అధికారిణి సావిత్రి వివరించారు. గర్భవతులు వైద్యుల సూచనల మేరకు పరీక్షలు చేసుకుంటూ వేళకు మందులు వాడాలన్నారు. మంచి పోషకాహారం తీసుకోవాలన్నారు. గర్భిణులకు పోషకాహారం పంపిణీ చేశారు.