ఐరాల మండలం మద్దిపట్టపల్లి వద్ద శరవణ అనే వ్యక్తి మద్యం తాగి బైక్ నడుపుతూ అదుపుతప్పి కింద పడ్డాడు. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు క్షతగాత్రుడిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు శరవణ మరణించినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఆదివారం తెలిపారు.