కౌన్సిలర్ల పై కమిషనర్ కు ఫిర్యాదు

74చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరులో పట్టణంలో కౌన్సిలర్లపై వాలంటీర్లు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ కు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు వాలంటీర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కౌన్సిలర్లు తమను బలవంతంగా రాజీనామా చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను ముఖ్యమంత్రి చంద్రబాబు విధుల్లో కి తీసుకోవాలని వాలంటీర్లు కోరారు.

సంబంధిత పోస్ట్