చంద్రగిరి మండలం రామిరెడ్డి పల్లిలో శుక్రవారం ఉత్సాహం ఉప్పొంగింది. పశువుల జాతర సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామంలో ఈ వేడుకలు ఏటా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన తుడా ఛైర్మెన్, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మోహిత్ రెడ్డి పరుష పందేలను వీక్షించారు.