నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించేందుకు పాకాల మండలంలోని తెలుగు తమ్ముళ్ళు భారీ ఎత్తున తరలి వెళ్లారు. మంగళవారం సాయంత్రం అధిక సంఖ్యలో
టీడీపీ,
జనసేన నాయకులు పాకాల పట్టణంలోని
టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని భారీ ఎత్తున టపాకాయలు పేల్చి అనంతరం బస్సులలో, కార్లలో అమరావతి బయలుదేరి వెళ్లారు.