జిల్లాలోని ఆశా కార్యకర్తలకు గ్రీవెన్స్ నిర్వహణ

59చూసినవారు
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ప్రభావతి దేవి ఆధ్వర్యంలో.. మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఛాంబర్ నందు జిల్లాలో పనిచేయు ఆశ కార్యకర్తల గ్రీవెన్స్ జరిగింది. ఇందులో 16 విషయాలపై వ్యక్తిగత ఆర్థిక విషయాలు, విధులకు సంబంధించిన విషయాలపై కంప్లైంట్స్ వచ్చాయి. పై విశయాలన్నింటినీ పరిశీలించి, జిల్లాలో పరిష్కారం అయ్యే ప్రతి విషయాన్ని పరిష్కరించి పీహెచ్సీలకు సర్కులేట్ చేయడం జరుగుతుందని, ఇక్కడ పరిష్కరించలేనివి స్టేట్ కి పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ హనుమంతరావు, ఏఓ పద్మజ, జిల్లా ఆశ నోడల్ అధికారి మూర్తి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్