నగరిలో రావణ రాజ్యం మొదలైందని, టీడీపీ సీనియర్ నాయకులు రామానుజం, చలపతి, టీడీపీ మండల అధ్యక్షులు లతాఉమాపతి ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ముఖానికి నల్లగుడ్డ చుట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, చంద్రబాబు సీఎం అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒకటవ డివిజన్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచరులు తమపై భౌతిక దాడులకు దిగారన్నారు.