వాతావరణం అనుకూలించక పోవడంతో పూత ఆలస్యం
గత ఏడాది కురిసిన అధిక వర్షాభావ కారణంతో వాతావరణం అనుకూలించకపోవడంతో మామిడి పూత ఆలస్యం అవుతుందని ఉద్యానవన శాఖ అధికారి వెంకట సౌజన్య అన్నారు. గురువారం నారాయణవనం మండలంలోని అరణ్యం కండ్రిగ, కృష్ణమ్మ రాజు కండ్రిగ గ్రామాలలోని మామిడి తోటలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ నెలలో కురిసిన వర్షాభావ ప్రభావం, దీనికి తోడు తేనె మంచు పురుగుల ఉధృతి ఎక్కువ కావడంతో పూత ఆలస్యం అవుతుందన్నారు.