దేశ ప్రధానమంత్రిగా మూడవసారి నరేంద్ర మోడీ ఆదివారం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయగానే పుంగనూరు నియోజకవర్గం సదుం బస్టాండు కూడలిలో బిజెపి , జనసేన , తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆదివారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.