పొలం పనులు చేస్తున్న రైతుపై తేనెటీగల దాడి

60చూసినవారు
పొలం పనులు చేస్తున్న రైతుపై తేనెటీగల దాడి
పొలం పనులకు వెళ్లిన రైతుపై తేనెటీగల దాడి చేయడంతో రైతు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. గురువారం తంబళ్లపల్లి మండలం రెడ్డి కోట గ్రామం మేకలవారి పల్లికి చెందిన ఈశ్వరయ్య (55) పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. కుటుంబీకులు గమనించి 108 వాహనంలో మదనపల్లి ఆసుపత్రి తరలించారు. వైద్యులు సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో ముప్పు తప్పింది.

సంబంధిత పోస్ట్