తల్లిని చంపిన కొడుకు, కోడలు అరెస్ట్

67చూసినవారు
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువులో ఈ నెల 22న ఆదివారం అర్థ రాత్రి ఏ. సఫియా భేగంను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన కేసులో.. మృతురాలి కొడుకు చిన్నరెడ్డి బాషా, కోడలు ఆషియాను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ములకళచెరువు సీఐ రాజారమేశ్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. లేట్ హైదరవల్లి భార్య సఫియాబేగం తో ఆమె చిన్నకొడుకు, కోడలు ఆస్తికోసం గొడవపడి మిద్దిపైన నిద్రిస్తున్న సఫియా బేగంను పథకం ప్రకారం కత్తితో గొంతుకోసి దారుణంగా చంపినట్లు విచారణలో తేలిండంతో నిందితులను అరెస్టు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్