తిరుపతి జిల్లాలో పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని రూరల్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో జీవకోన నవజీవన్ కాలనీకి చెందిన వి. మణి(30) దొరికాడు. అతని నుంచి రూ. 2. 20 లక్షల విలువైన 109 గ్రాముల బంగారం, 109 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తమీమ్ అహ్మద్ వెల్లడించారు. నిందితుడు గతంలోనూ జైలు జీవితం అనుభవించినట్లు చెప్పారు.