తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర అనంతరం మూడో మంగళవారం విశేషాలంకరణలో గంగమ్మ భక్తులకు దర్శనం ఇస్తుంది. ఉదయం వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం దేశంలో లభించే వివిధ రకాల పండ్లతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మూడో మంగళవారం ఉదయం నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారు.