విశాఖపట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. గోపాలపట్నం, కంచరపాలెంలో భవనాల కింద మట్టి కూలిపోతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. స్థానికులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, వాయుగుండం నేపథ్యంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.