కౌంటింగ్ ఏజెంట్లపై వ్యాఖ్యలు.. సజ్జలపై కేసు నమోదు
![కౌంటింగ్ ఏజెంట్లపై వ్యాఖ్యలు.. సజ్జలపై కేసు నమోదు](https://media.getlokalapp.com/cache/ca/93/ca936f8011b520a4886c288d7e234ed7.webp)
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమా, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.