టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన పలు బహిరంగ సభల్లో సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, పవన్, చంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు.