శ్రీశైలం పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

28297చూసినవారు
శ్రీశైలం పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
నంద్యాల జిల్లా శ్రీశైలం వన్ టౌన్ పీఎస్ లో విషాదం చోటు చేసుకుంది. రెస్ట్ రూమ్ లో గన్ తో కాల్చుకుని కానిస్టేబుల్ శివశంకర్ రెడ్డి(46) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు శివశంకర్ రెడ్డి కర్నూలు వాసి అని పోలీసులు తెలిపారు. శివశంకర్ రెడ్డి ఆత్మహత్యకు కుటుంబ సమస్యలా లేక ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you