భార్య శిరోముండనం చేసిన కానిస్టేబుల్
విశాఖలోని అనకాపల్లి పోలీస్ స్టేషన్లో శంకర్ అనే వ్యక్తి కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. శంకర్ భార్య మహాలక్ష్మి రూ.2.5 లక్షలు అప్పు చేసింది. డబ్బులు ఇచ్చిన వాళ్లు తిరిగి ఇవ్వమని ఇంటికి వచ్చి గొడవ చేశారు. దాంతో భార్యపై శంకర్కు అనుమానం పెరిగింది. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చావని ఆమెపై దాడి చేశాడు. ఆమెకు శిరోముండనం చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాంతో మహాలక్ష్మి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.